manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 2:44 pm Editor : manabharath

విద్యుత్ శాఖ నూతన ఏఈగా గుగులోతు నగేష్ ..

మొగుళ్ళపల్లి విద్యుత్ శాఖ నూతన ఏఈగా గుగులోతు నగేష్ బాధ్యతల స్వీకరణ

-బాధ్యతలు చేపట్టిన ఏఈ గుగులోత్ నగేష్ ను శాలువాలతో ఘనంగా సత్కరించిన విద్యుత్ సిబ్బంది

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల విద్యుత్ శాఖ నూతన ఏఈగా గుగులోత్ నగేష్ శనివారం విద్యుత్ శాఖ కార్యాలయంలోని తన చాంబర్ లో బాధ్యతలను స్వీకరించారు. గతంలో భూపాలపల్లి రూరల్ ఇంజనీర్ గా విధులను నిర్వహించిన ఆయన మొగుళ్ళపల్లి విద్యుత్ శాఖ ఏఈగా పదోన్నతి పొందారు. గతంలో ఇక్కడ ఇన్చార్జీ ఏఈగా పని చేసిన సంజయ్ గత నెలలో విద్యుత్ శాఖ ఏఈగా పదోన్నతి పొంది బదిలీపై భూపాలపల్లికి వెళ్లారు. కాగా నూతనంగా మొగుళ్ళపల్లి విద్యుత్ శాఖ ఏఈగా బాధ్యతలను చేపట్టిన గుగులోతు నగేష్ ను విద్యుత్ శాఖ సిబ్బంది శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫోర్ మెన్ యాదగిరి, టీఆర్వీకెఎస్ జిల్లా నాయకులు శ్రీనివాస్ నాయక్, లైన్మెన్లు మచ్చ సత్యం, శ్రీనివాస్, అనిల్, ఏఎల్ఎంలు రమేష్, సంపత్ రావు, మహిపాల్, శ్రీనివాస్, శంకర్, ఆన్ మ్యాన్డ్ వర్కర్స్ వేముల కిరణ్ గౌడ్, నరేష్, యుగంధర్, స్పాట్ బిల్డర్లు ప్రసాద్, రాజ్ కుమార్, ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ రిపోర్టర్ మన భారత్..

మన భారత్ లో పని చేయుటకు జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గ, మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.