manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 3:49 pm Editor : manabharath

ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్

మన భారత్ |జూలై 19 తలమడుగు

ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం.. 10 రోజుల పాటు ‘SIR’ కార్యక్రమంపై పూర్తి దృష్టి సారించాలి: ఆడే గజేందర్

తలమడుగు, జూలై 19: ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి అత్యంత విలువైన హక్కు ఓటు హక్కు అని, దానిని కాపాడుకునేందుకు రాబోయే పది రోజుల పాటు అన్ని పనులను పక్కనపెట్టి సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ పిలుపునిచ్చారు.

ఆదివారం తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో నిర్వహించిన SIR సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో ప్రతి అర్హులైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని సూచించారు. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుండగా, ఎన్నికల సంఘం ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతోంది.

ఈ సమావేశంలో ఆదిలాబాద్ పార్లమెంట్ SIR కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, ఆదిలాబాద్ నియోజకవర్గ అబ్జర్వర్, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి, బోథ్ నియోజకవర్గ అబ్జర్వర్ రమేష్, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజా రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, తలమడుగు మాజీ జడ్పీటీసీ గోకా గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఓటు సురక్షితంగా ఉండేలా కృషి చేయాలి

ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ, ఈ నెలాఖరు వరకు ప్రతి నాయకుడు, కార్యకర్త తమ పరిధిలోని ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన ఫారాలను గడువులోగా సమర్పించేలా అవగాహన కల్పించాలని సూచించారు. నిర్దేశిత సమయంలో ప్రక్రియ పూర్తి చేయకపోతే అర్హులైన ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

పార్టీ శ్రేణులకు స్పష్టమైన మార్గదర్శకాలు

బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAs), సూపర్‌వైజర్లు, మండల అధ్యక్షులు, గ్రామ నాయకులు పరస్పర సమన్వయంతో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరించాలని సూచించారు. ప్రతి కార్యకర్త తమ ఓటుతో పాటు ప్రజల ఓట్లు కూడా జాబితాలో సక్రమంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
ప్రజలకు విజ్ఞప్తి

సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో ప్రజలందరూ చురుకుగా పాల్గొని, తమ పేరు ఓటరు జాబితాలో సరిగా నమోదైందో లేదో పరిశీలించుకోవాలని, అవసరమైతే సంబంధిత ఫారాలు సమర్పించి వివరాలను సరిచేసుకోవాలని ఆడే గజేందర్ విజ్ఞప్తి చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, మండల అధ్యక్షులు, పార్టీ వివిధ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, బరంపూర్ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి