విడుదలైన నీట్ ఫలితాలు
-ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు
విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్
మన భారత్,మొగుళ్ళపల్లి:
గురువారం విడుదలైన నీట్ ఫలితాలలో హన్మకొండలోని రాజస్థాన్ కోటా మోషన్ కాలేజీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జాతీయస్థాయిలో అత్యుత్తమ మార్కులను సాధించి..కన్న తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, పుట్టిన ఊరికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం మోషన్ కాలేజీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ విలేకరులతో మాట్లాడారు. నీట్ ఫలితాలలో జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. భూక్య అశ్విక 531 మార్కులు ( హాల్ టికెట్ నెంబర్:-4211102168 ), బొమ్మకంటి నిహారిక 425 మార్కులు ( హాల్ టికెట్ నెంబర్:-4205111090 ) జాతీయ స్థాయిలో అత్యుత్తమ మార్కులను సాధించి మోషన్ కాలేజీకి పేరు ప్రఖ్యాతులను తీసుకువచ్చినందుకు విద్యార్థులను, ఈ విజయానికి తోడ్పాటునందించిన అధ్యాపకులను, సహకరించిన తల్లిదండ్రులను కాలేజీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, డైరెక్టర్ పెరుమాండ్ల అనిల్ గౌడ్, మారపల్లి సమ్మయ్యలు అభినందించారు.
