manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 12:21 pm Editor : manabharath

మీరు రిపోర్టర్ కావాలని అనుకుంటున్నారా.!

రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఇదే మీకు సువర్ణావకాశం!

సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఆసక్తి ఉన్న వారికి ‘మన భారత్’లో రిపోర్టర్‌గా అవకాశం

మన భారత్, తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్:

సమాజంలో జరుగుతున్న సంఘటనలను ప్రజలకు చేరవేయాలనే అభిరుచి ఉందా? వార్తల సేకరణ, రచన, ప్రజా సమస్యలపై స్పందించే తత్వం మీలో ఉందా? అయితే మీ కోసం ‘మన భారత్’ ప్రత్యేక అవకాశాన్ని అందిస్తోంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వార్తా విస్తరణను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో జిల్లా, నియోజకవర్గం, మండల, పట్టణ, గ్రామ స్థాయిల్లో రిపోర్టర్లను నియమించేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పాత్రికేయ రంగంపై ఆసక్తి ఉన్న యువత, సామాజిక సేవాభావం కలిగిన వారు, స్థానిక సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావాలనే సంకల్పం ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. వార్తలను సేకరించడం, ఫోటోలు, వీడియోలు పంపించడం, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం వంటి అంశాల్లో ఆసక్తి ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.

డిజిటల్ మీడియా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో పాత్రికేయ వృత్తి సమాజంలో కీలకమైన బాధ్యతగా మారింది. ప్రజలకు నిష్పక్షపాత సమాచారాన్ని అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ‘మన భారత్’ యాజమాన్యం కోరుతోంది.

అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యతతో పాటు, పాత్రికేయ రంగంలో కొత్తగా అడుగుపెట్టాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులకు కూడా మార్గదర్శకత్వం అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిబద్ధత, నిజాయితీ, సామాజిక బాధ్యత కలిగిన అభ్యర్థులు తమ వివరాలతో సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వివరాలకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

మీ విశాల్ కుమార్, ఎడిటర్, మన భారత్.