బోథ్ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్గా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నియామకం
మన భారత్, ఆదిలాబాద్:
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత బుధవారం నియోజకవర్గాల వారీగా పార్టీ ఇంచార్జ్లను అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్గా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ను నియమించారు.
ఈ నియామకంపై బోథ్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ రాథోడ్ బాపురావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో ఆయన నాయకత్వం కీలకంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.
అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున మరింత సమర్థవంతంగా పనిచేస్తూ, గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను మరింత చురుకుగా నిర్వహిస్తామని నాయకులు తెలిపారు. ఈ నియామకం ద్వారా బోథ్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు మరింత వేగవంతమవుతాయని, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బోథ్ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, నాయకులు, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తే బోథ్ నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లో పని చేయుటకు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను. ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
