manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 12:35 am Editor : manabharath

నిబంధనలకు విరుద్ధంగా వినాయక ఆగ్రో ఏజెన్సీస్

-రైతుల ఫిర్యాదు మేరకు వ్యవసాయ శాఖ అధికారుల తనిఖీలు

– తనిఖీల్లో నిబంధనలు పాటించని వినాయక ఆగ్రో ఏజెన్సీస్

-వినాయక ఆగ్రో ఏజెన్సీస్ ను సీజ్ చేసిన వ్యవసాయ అధికారులు

మన భారత్,మొగుళ్ళపల్లి:

విత్తన, ఎరువుల మరియు పురుగుమందుల డీలర్లు సూచించబడిన చట్టాలకు లోబడి విక్రయాలు జరుపుకోవాల్సి ఉండగా..జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని వినాయక ఆగ్రో ఏజెన్సీస్ డీలర్ ఇరుపాల రాజేశ్వర్ రావు నిబంధనలకు విరుద్ధంగా ఫర్టిలైజర్ షాప్ ను నడుపుతుండడంతో..రైతుల ఫిర్యాదు మేరకు భూపాలపల్లి ఏడిఏ ఎన్ రమేష్ నేతృత్వంలో వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఎరువుల లభ్యత, నిల్వలు, లైసెన్స్ వివరాలు, కొనుగోలు రసీదులు, అమ్మకపు బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ ధరల పట్టిక మొదలగునవి పరిశీలించారు. స్థానిక విచారణ ద్వారా సంబంధిత ఎరువుల డీలర్ ఇరుపాల రాజేశ్వర్ రావు ఎరువుల చట్టాలకు విరుద్ధంగా విక్రయాలను నిర్వహిస్తున్నట్టు నిర్ధారణ కావడం జరిగిందని ఏడిఏ ఎన్ రమేష్ తెలిపారు. వినాయక ఆగ్రో ఏజెన్సీస్ తనిఖీల్లో డీఏపి మరియు ఇతర ఎరువులను ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలు జరపడం, స్టాక్ వివరాలను ప్రదర్శించకపోవడం, స్టాక్ వివరాలు టాలీ కాకపోవడం, అమ్మిన ఎరువులకు సంబంధించిన బిల్లులను రైతులకు ఇవ్వకపోవడం, ఈ-పాస్ మెషిన్ లోని వివరాలకు, నిల్వ ఉన్న స్టాక్ వివరాలకు మధ్య వ్యత్యాసం ఉండడం పైన పేర్కొన్న చట్ట విరుద్ధ చర్యలకు గాను లైసెన్స్ అథారిటీ గారు సంబంధిత ఎరవుల లైసెన్స్ ను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీకాంత్ పాల్గొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పని చేయుటకు జిల్లా స్టాప్ రిపోర్టర్ కావలెను. ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.