manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 2:34 pm Editor : manabharath

విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేసి

కొర్కిశాల కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల గ్రామంలోని కేజీబీవీ పాఠశాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన, భోజన సదుపాయాలు, వసతి మరియు ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు నీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే సంబంధిత మిషన్ భగీరథ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేస్తున్న విద్యా, సంక్షేమ పథకాలు సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వార్డెన్లు, ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు అందించిన స్నాక్స్‌ను వారితో కలిసి ఎమ్మెల్యే తిన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదికారులు, ప్రజా ప్రతినిధులు పాలొన్నారు.