manabharath.com
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 11:00 pm Editor : manabharath

మొగుళ్ళపల్లి మండలానికి దక్కిన అరుదైన గౌరవం

మొగుళ్ళపల్లి మండలానికి దక్కిన అరుదైన గౌరవం

గిన్నిస్ వరల్డ్ రివార్డ్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఏఆర్ కానిస్టేబుల్ కుమారుడు రిత్విక్ తేజతో పాటు మరో నలుగురు చిన్నారులు

-చిన్నారులను అభినందించి క్యాష్ రివార్డ్ ను అందజేసిన మంత్రి కొండా సురేఖ

మన భారత్,మొగుళ్ళపల్లి:

మొగుళ్లపల్లి మండల కేంద్రానికి అరుదైన గౌరవం దక్కింది. అతి చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్ రంగంలో తెలుగు రాష్ట్రాల కీర్తిని, భారతదేశ ప్రతిష్టతను ,ఇటీవల మార్షల్ ఆర్ట్స్ రంగంలో తెలుగు రాష్ట్రాల కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి గిన్నిస్ వరల్డ్ రికార్డు లోకి ప్రవేశించి గోల్డ్ మెడల్ సాధించి అవార్డుతో పాటు ప్రశంస పత్రాన్ని అందుకున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ కుమారుడు రిత్విక్ తేజాను తెలంగాణ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అభినందించారు. కుర్రాడి వయసులోనే మారుమూల ప్రాంతం నుండి అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం సంతోషకరమని తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్ కు మంత్రి 3000 క్యాష్ రివార్డును అందించారు. అలాగే అటు చదువులో ఇటు మార్సెల్ ఆర్ట్స్ రంగంలో తనదైన ముద్ర వేసేలా ప్రోత్సహిస్తున్న కానిస్టేబుల్ రాజ్ కుమార్ ను సైతం మంత్రి అభినందించారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..