manabharath.com
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 8:23 pm Editor : manabharath

జిల్లా కలెక్టర్‌కు ఘన సన్మానం..

దివ్యాంగులకు డబుల్ బెడ్‌రూమ్ కేటాయింపులో సహకరించిన జిల్లా కలెక్టర్‌కు ఘన సన్మానం

హ్యాండీక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అభినందనలు

– దివ్యాంగులకు ఇళ్లు కేటాయించాలని విజ్ఞప్తి

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో సహకరించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు హ్యాండీక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఘనంగా సన్మానం చేశారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా రాజర్షి షా ఐఏఎస్ విధులు నిర్వహిస్తున్నారు.

హ్యాండీక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న నేపథ్యంలో, ఇంకా అద్దె ఇళ్లలో నివసిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు దివ్యాంగులకు కూడా ఇళ్లను కేటాయించాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశామని తెలిపారు.

సొసైటీ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్, దివ్యాంగుల కోటా పరిధిలో అర్హులైన కొంతమందికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవడం పట్ల సొసైటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు మరింత చొరవ చూపాలని సొసైటీ సభ్యులు కోరారు. అలాగే అర్హులైన ప్రతి దివ్యాంగ కుటుంబానికి గృహ వసతి కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో Faisal Ahmed, Mohammed Mohsin, Afroz Khan, Shoaib Hasnain, Amir, Syed Sajid, Mustafa, Iqbal, Tara Hussain తదితరులు పాల్గొన్నారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ 

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..