బాసర అమ్మవారి ఆలయానికి భక్తుల కానుకల వెల్లువ..
49 రోజుల్లో రూ.1.06 కోట్ల హుండీ ఆదాయం మిశ్రమ బంగారం, వెండి, విదేశీ కరెన్సీ నోట్లు సమర్పించిన భక్తులు మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. ఆలయంలో నిర్వహించిన 49 రోజుల హుండీ లెక్కింపులో మొత్తం రూ.1,06,45,359 నగదు ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా నగదుతో పాటు బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా...