సభా మర్యాద పాటించరా.?
మున్సిపల్ సమావేశంలో సభ్యుల వ్యవహారశైలిపై చర్చ చైర్పర్సన్ సీటు వరకు కౌన్సిలర్లు వెళ్లడంపై భిన్నాభిప్రాయాలు.. సభా మర్యాదలు పాటించాలంటున్న ప్రజలు మన భారత్, ఆదిలాబాద్: మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కొందరు కౌన్సిలర్లు నేరుగా చైర్పర్సన్ సీటు వద్దకు వెళ్లి మాట్లాడిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో జరిగిన కౌన్సిల్ సమావేశాలతో పోలిస్తే ఈసారి సభ్యుల వ్యవహారశైలిలో మార్పు కనిపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో సభ్యులు తమ అభిప్రాయాలు, సమస్యలను సభా నియమావళి...