manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 7:10 pm Editor : manabharath

సమరభేరి సభ విజయవంతం చేయాలి..

చలో భువనగిరి జూలై ఫిఫ్త్ న రాజ్యాధికార సమరభేరి సభకు హాజరై విజయవంతం చేయాలి

తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ 

మన భారత్, భూపాలపల్లి:

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో ఆదివారం భూపాలపల్లిలోని అంబేడ్కర్ హమాలీ సంఘం కార్మికులకు, ది కాకతీయ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లు, క్లీనర్ల సంఘం సభ్యులకు, బీసీ నాయకుడు గుమ్మడి ప్రదీప్, తెలంగాణ గౌడ సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్, అలాగే జిల్లాలోని వివిధ కుల సంఘాల నాయకులకు జూలై 5న భువనగిరిలో జరగనున్న రాజ్యాధికార సమరభేరి సభకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, రాజకీయ మార్పు రావాలంటే తీన్మార్ మల్లన్న నాయకత్వం అవసరమని అన్నారు. జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న రాజ్యాధికార సమరభేరి సభ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త ప్రభంజనం సృష్టిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, వివిధ కుల సంఘాల నాయకులు, యువత, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున సభకు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గండు కరుణాకర్, మోటపోతుల సమ్మయ్య, రవీందర్, వనం నరేష్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.