విద్యతోనే గ్రామ అభివృద్ధి సాధ్యం: ఎంపీడీవో శంకర్
మన భారత్ | ఆదిలాబాద్ తలమడుగులో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ తలమడుగు, జూన్ 15 (మన భారత్): విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని తలమడుగు మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) శంకర్ సూచించారు. తలమడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా...