కలెక్టర్ కు ఘన స్వాగతం పలికిన సర్పంచ్ సంజీవ్..
మన భారత్, ఆదిలాబాద్: ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు తలమడుగు: గ్రామాల సమగ్ర అభివృద్ధికి గ్రామసభలు కీలక వేదికలని, ప్రజల సమస్యలు సత్వర పరిష్కారం కావాలంటే అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తలమడుగు మండలంలోని పల్లి(బి) గ్రామంలో శనివారం నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న ఆయన, గ్రామ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామసభలో గ్రామాభివృద్ధి, మౌలిక వసతులు, తాగునీటి...