ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న ప్రయోగం
మన భారత్, విజయనగరం: పాత టైర్లతో స్పీడ్ లిమిట్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు డెంకాడ, జూన్ 6: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా విజయనగరం జిల్లా డెంకాడ మండల పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలను తగ్గించేందుకు పాత, వృథాగా పడి ఉన్న టైర్లను వినియోగించి ప్రత్యేక హెచ్చరిక బోర్డులను రూపొందించారు. డెంకాడ సీఐ రామకృష్ణ, ఎస్సై సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో వందలాది పాత టైర్లను సేకరించి వాటికి ఆకర్షణీయమైన...