వ్యవసాయ బావిలో పడి పులి మృతి..
దుర్వాసన రావడంతో బయటపడిన ఘటన.. శవపరీక్ష అనంతరం ఖననం మన భారత్, మహారాష్ట్ర: మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లా బ్రహ్మపురి అటవీ పరిధిలోని చారగావ్ గ్రామ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో పడి ఓ ఆడపులి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సోమవారం రైతు పాండురంగ తన వ్యవసాయ క్షేత్రంలోని బావి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటాన్ని గమనించాడు. అనుమానం వచ్చి బావిలోకి పరిశీలించగా పులి కళేబరం కనిపించింది. వెంటనే ఆయన...