వరుణదేవా… నువ్వైనా కనికరించవా!
అకాల వర్షాలతో రైతుల ఆవేదన కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దవుతున్న ధాన్యం లారీలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని నీ ఝరి గ్రామంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు రాత్రి వేళల్లో కురుస్తున్న అకాల వర్షాలు రైతుల కష్టాలను మరింత పెంచుతున్నాయి. ఎంతో శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు ఇప్పుడు ప్రకృతి ప్రహారం, అధికారుల నిర్లక్ష్యం...