ఎర్రకోటలో జనజాతి సంస్కృతి: ఎంపీ
ఆదివాసి సంస్కృతి పరిరక్షణపై ఎంపీ గోడం నగేష్ పిలుపు మన భారత్, ఆదిలాబాద్: దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా నిర్వహించిన జనజాతి సంస్కృతి సమాగం కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన గిరిజన ప్రతినిధులతో కలిసి ఆయన ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన ఆదివాసి ప్రతినిధులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జనజాతి సంస్కృతి సమాగం...