వరుస దొంగతనాలు.. గ్రామస్తుల్లో భయాందోళన
మన భారత్ | విజయనగరం ,(దత్తిరాజేరు): విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న వరుస దొంగతనాలు గ్రామస్తుల్లో భయాందోళనకు గురిచేశాయి. గ్రామంలోని పలు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు నగదు, బంగారం, వెండి సామాగ్రితో పాటు విలువైన వస్తువులను అపహరించడంతో పాటు స్థానిక శివాలయంలోనూ చోరీకి పాల్పడటం సంచలనం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టగా, అనంతరం క్లూస్ టీం గ్రామానికి వచ్చి సంఘటన స్థలాలను పరిశీలించింది....