జిల్లా పురోహితునికి ‘జ్యోతిర్వేది’ బిరుదు..
మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్): ఆధ్యాత్మిక సేవలు, జ్యోతిష్య విజ్ఞానం, వాస్తు శాస్త్రంలో విశిష్ట సేవలను అందిస్తున్న ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన శివ శ్రీ శిలంకోటి శివాజీ పురోహితులు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. హైదరాబాద్లో ఇటీవల నిర్వహించిన జ్యోతిష్య సమ్మేళన కార్యక్రమంలో ఆయనకు ప్రతిష్టాత్మకమైన ‘జ్యోతిర్వేది’ బిరుదు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తలమడుగు మండల ప్రజలు, దేవాపూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ పురోహితుడిని అభినందించారు. హైదరాబాద్...