జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం.. విద్యార్థులకు పెద్ద ఊరట
మన భారత్, ఆదిలాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం విద్యార్థుల్లో ఆనందాన్ని నింపింది. ఈ నిర్ణయంతో ముఖ్యంగా పేద, గిరిజన, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 75 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు...