కష్టపడి పనిచేసే కార్యకర్తకు గుర్తింపు: సంతోష్
మన భారత్, ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుందని తాంసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంతోష్ అన్నారు. పార్టీ బలోపేతం కోసం శ్రమించిన కార్యకర్తల సేవలను ఎప్పటికీ విస్మరించబోమని ఆయన స్పష్టం చేశారు. తాంసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన సంతోష్ను శుక్రవారం గొట్కూరి గ్రామస్తులు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ...