కూలీలతో పోలీసుల ప్రత్యేక సమావేశం..
మన భారత్: ద్వారపురెడ్డి పాలెం గ్రామంలో గల చెరువు వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న మహిళలతో పోలీసులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మహిళల భద్రత, రహదారి ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలు తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డెంకాడ ఎస్ఐ మాట్లాడుతూ మహిళల భద్రతకు పోలీసులు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్...